వైసిపి ప్రభుత్వంలో అణగారి పోతున్న పేద ప్రజలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ వేగేశన నరేంద్ర వర్మ అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం బాపట్ల నియోజకవర్గంలో ఇదేమీ ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం చేపట్టారు. నేడు బాపట్ల మండలం లోని స్టూవర్ట్ పురం గ్రామంలో, బాపట్ల పట్టణంలోని 33,16,10 వ వార్డులలో నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నరేంద్ర వర్మ వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలనతో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని దోచుకొంటూ వ్యవస్థ లను బ్రష్టు పట్టిస్తున్నారు. నిబంధనల పేరుతో సంక్షేమ పథకాలు ఆపేస్తున్నారు. దివ్యంగులకు, ఒంటరి మహిళలకు పెన్షన్లు తీసేసి వారి కడుపు మీద కొట్టారు. రాష్ట్రాన్ని అన్నివిధాల దిగజార్చి ప్రతి ఒక్కరూ కూడా ఇదేమి ఖర్మ అనుకొనే పరిస్థితి కి తీసుకొచ్చారు. సామాన్య ప్రజలు బ్రతకడం కూడా కష్టమవుతుంది అనే పరిస్థితి కి దిగజార్చారు అని ఆయన అన్నారు.
ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించాడానికి తెలుగుదేశం పార్టీ తరపున పోరాటం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అవసమైతే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు అండగా ఉంటామని నరేంద్ర వర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పట్టణ మరియు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.