31.2 C
Hyderabad
July 4, 2024 14: 21 PM
Slider ఆదిలాబాద్

స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయాలి

student

ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో అదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో RDO వినోద్ కుమార్ గారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా AISF జిల్లా కార్యదర్శి గేడం కేశవ్, మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 7 వేల పై చిలుకు కోట్ల రూపాయల స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడం ద్వారా విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్యార్ధులు చదివిన కళాశాలలో తమ కోర్సు పూర్తి చేసిన కూడా వారి సర్టిఫికెట్లు కళాశాల యాజమాన్యాలు ఇవ్వడం లేదని, దీనిద్వారా ఉన్నత చదువులకు మరియు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న వారికి ఇబ్బందికరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Related posts

కార్మిక గర్జన సిఐటియు పాదయాత్ర వాల్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

Satyam NEWS

వేగంగా స్పందించిన దిశ పోలీసులు

Bhavani

ఎర్రజెండా ముద్దుబిడ్డ కామ్రేడ్ అప్పలరాజు కి విప్లవజోహార్లు..!

Satyam NEWS

Leave a Comment