మన్యం జిల్లా పాచిపెంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతిని ఇద్దరు వ్యక్తులు ఇంటికెళ్లి దుర్భాశలాడుతూ, భయబ్రాంతులకు గురిచేశారు. ఈ నేపథ్యంలో మాధురి అనే యువతి దిశ SOS కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పాచిపెంట లో నివాసముండే మాధురి వాళ్ళ తండ్రికి, నరసింహులు అనే వ్యక్తికి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది.
ఈ నేపథ్యంలో నరసింహులు, ఆది అనే వ్యక్తులు మాధురి ఇంటికెళ్లి గొడవ చేశారు. ఇంట్లో పెద్దలు ఎవరూ లేరని చెప్పినప్పటికీ వినకుండా మాధురిని దుర్భాశలాడుతూ, ఇబ్బందులకు గురిచేశారు. భయబ్రాంతులకు లోనైన యువతి దిశ SOS కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది. పాచిపెంట లో నివశిస్తున్న యువతి ఇంటికి దిశ పోలీసులు పది నిముషాల వ్యవధిలో చేరుకున్నారు. మాధురిని భయబ్రాంతులకు గురిచేసిన వారి వివరాలను పోలీసులు సేకరించారు.
యువతి సూచన మేరకు నరసింహులు, ఆది అనే వ్యక్తులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. మరొకసారి బాధితురాలి ఇంటికెళ్లి గొడవ చేసినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇద్దరికి పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. దిశ SOS కు కాల్ చేసిన వెంటనే స్పందించి, సమస్యను పరిష్కరించిన పోలీసులకు బాధిత యువతి కృతజ్ఞతలు తెలిపింది.