పార్లమెంట్ లో బీజేపీకి మా అవసరం ఉంది పార్లమెంట్ లో బీజేపీకి తమ అవసరం ఉందని ఓటమి పాలైన వైసీపీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన విజయసాయి రెడ్డి తెలిపారు. పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీకి ఉన్నంత బలం తమకూ ఉందని విజయసాయిరెడ్డి అన్నారు. టీడీపీకి లోక్ సభలో 16 స్థానాలు ఉన్నాయని, తమ పార్టీకి లోక్ సభలో 4, రాజ్య సభలో 11 స్థానాలు ఉన్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారం కోల్పోయినప్పటికీ పార్లమెంట్ లో తమ బలం తగ్గలేదని ఆయన అన్నారు. రాజ్యసభలో బిల్లుల ఆమోదానికి బీజేపీకి తమ అవసరం ఉందని గుర్తించాలి. రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం పార్లమెంట్ లో ఎన్ డి ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులకు మద్దతిస్తాం అని ఆయన వివరించారు.
previous post