మేడారం శ్రీ సమ్మక్క – సారలమ్మ మహా జాతర దృష్ట్యా ములుగు, భద్రాది కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో ఇసుక విక్రయాలను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ జనరల్ మేనేజర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ములుగు, భద్రాది కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో ఈ నెల 21 నుంచి 24 వరకు ఇసుక లోడింగ్, ఆన్లైన్ విక్రయాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ట్రాఫిక్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. అదే విధంగా ఇతర జిల్లాలకు పరిమితిలో ఆన్లైన్లో విడుదల చేస్తామని తెలిపారు.