29.7 C
Hyderabad
July 3, 2024 15: 59 PM
Slider కడప

వైసీపీ నేతలకు మాత్రమే ఇసుక దొరుకుతుంది

#TDP Kadapa

వైసీపీ నేతలకు తప్ప, ఇళ్ళు కట్టుకునే వారెవరికీ ఇసుక దోరకడం లేదని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ ఆరోపించారు. బుధవారం  కడప నగరంలోని హరి టవర్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ ప్రభుత్వం పై వారు ఆరోపణాస్త్రాలను సంధించారు. డబ్బు కట్టినా దోరకని ఇసుక బెంగుళూరుకు ఎలా తరలిపోతుందని ప్రశ్నించారు.

విజయసాయిరెడ్డి అల్లుడు 108, 104 సేవల్లో దోపిడీ చేశారని ఆధారాలతో సహా నిరూపించినా దానిపై ఎందుకు మంత్రులు నోరు మెదపడం లేదని నిలదీశారు. రివర్స్ టెండర్ అని చెప్పి రిజర్వ్ టెండరింగ్  పెట్టుకుని దోపిడీ చేస్తున్నారని నిప్పులు చెరిగారు. దశల వారీగా పెంచుతానని చెప్పి పెంచిన పెన్షన్ ఇవ్వకుండా అవ్వ, తాతలను మోసం చేశారని మండిపడ్డారు.

రకరకాల డైలాగులు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ మాట తప్పారన్నారు. వంచన చేసిన జగన్ ను తాత అవ్వలు నిలదీయాలని సూచించారు. రాష్ట్రం లోఅన్ని వ్యవస్థలను రంగాలను నిర్విర్యం చేస్తున్న వైసీపీ ప్రభుత్వమని దుయ్యబట్టారు. ఇసుక కోరత కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవడంలో ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తుందని ఎద్దేవా చేశారు.

ఇసుక పాలసీ విధానాలను మార్చి దోపిడీకి తెరలేపిన జగన్మోహన రెడ్డి చర్యలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. సామాన్య ప్రజలకు ఇసుక దోరకడం లేదన్నారు. కానీ ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించి వైసీపీ నేతలు  దోచుకుంటునారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే మూడు వేల పెన్షన్ ఇచ్చే వాళ్ళమని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు యాటగిరి రామ్ ప్రసాద్ వరప్రసాద్ పాల్గొన్నారు

Related posts

NSUI నాయకుల అరెస్ట్ అప్రజాస్వామ్యం

Satyam NEWS

రూ.2.10 కోట్లతో అభివృద్ది పనులకు శంకుస్థాపనలు

Satyam NEWS

బీసీలకు న్యాయం చేయని తెలంగాణ సీఎం కేసీఆర్

Satyam NEWS

Leave a Comment