సార్వత్రిక ఎన్నికల అనంతరం విజయనగరం జేఎన్టీయూ, లెండీ ఇంజనీరింగ్ కళాశాలల్లో భద్రపరచిన స్ట్రాంగ్ రూం వద్ద మూడంచెల భద్రతను జిల్లా ఎస్పీ ఎం.దీపిక పర్యవేక్షించారు.అలాగే స్ట్రాంగ్ రూమ్ లను విస్త్రంగా తనిఖీలు నిర్వహించారు.అక్కడే విధులు నిర్వహిస్తున్న సి బ్బందిని తగు జాగ్రత్తలు ఇచ్చారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని సిబ్బందిని ఆదేశించారు.ఎస్పీ తో పాటు విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు, ట్రాఫిక్ డిఎస్పీ డి.విశ్వనాథ్ మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారు.కాగా నిన్న ఏఎస్పీ ఆస్మాఫర్హీన్ తనిఖీలు చేయగా తాజాగా పోలీస్ బాస్ దీపిక సిబ్బందిని అలెర్ట్ చేశారు.