ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు పనులను పరిశీలించిన ఆయన ఆ తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఆయన వెంట నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులకు తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థికపరమైన అంశాలన్నీ పరిష్కారం అవుతాయని తెలిపారు. 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ద్వారా నీరందిస్తామని హామీ ఇచ్చారు.
అంతకుముందు హెలికాప్టర్ లో పోలవరం చేరుకున్న సీఎంకు ఘనస్వాగతం లభించింది.
మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఆళ్ల నాని, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత తదితరులు స్వాగతం పలికారు.