వనపర్తి మునిసిపల్ వైస్ ఛైర్మన్ వాకిటి శ్రీధర్ పట్టణంలో ని 30 వార్డులో జంగిడిపురం, నందిహిల్స్ లో పట్టణ ప్రగతి కార్యక్రమం లో పాల్గొనీ శ్రమదానం చేసి ముళ్ళ కంపలను మట్టి దిబ్బలను తరలించారు. పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా అనేక దీర్ఘ కాలిక సమస్యలు పరిష్కారం అవుతుందని వాకిటి శ్రీధర్ చెప్పారు.
మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశాలమేరకు కలెక్టర్ షేక్ యాష్మీన్ భాష పర్యవేక్షణలో దాదాపు 240మంది తో పట్టణం అంత శుభ్రం చేయడం జరుగుతుందన్నారు. ఇంత గొప్ప కార్యక్రమం తీసుకు వచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ కు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి