కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం లోని పాలనాధికారి సమావేశ మందిరంలో బుధవారంఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యురాలు దనసరి అనసూయ (సీతక్క) ని కలిసి కాగజ్ నగర్ న్యూ ప్రెస్ క్లబ్ స్థలం మరియు భవన నిర్మాణం ,కొరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కోసం వినతి పత్రం ఇవ్వడం జరిగిందిఈ సందర్బంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కాగజ్ నగర్ ప్రెస్ క్లబ్ నిర్మాణానికి సహకరిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాగజ్ నగర్ న్యూ ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు వాడ్నాల వెంకన్న,అధ్యక్షులు కాంపెల్లి రతన్ కుమార్ప్రధాన కార్యదర్శి నౌషాద్. కమిటీ సభ్యులు అతికొర్రహమాన్ పయాజ్ పాల్గొన్నారు
previous post
next post