రాష్ట్రంలో చివరి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మరి కొద్ది గంటల్లో ప్రారంభవనుంది.దాదాపు 2వేల యాభై మందికి పైగా పోలీసులు ఎన్నికల బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఈ మేరకు ఎన్నికల జరగబోవు 295 పోలింగ్ బూత్ లకు ఎస్పీ రాజకుమారి… బందోబస్తు నియమించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్….విజయనగరం జిల్లాకు వస్తున్నారు.
నేరుగా జిల్లా లోని కొత్తవలస పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగే ఎన్నికల బందోబస్తు పరిశీలన నిమిత్తం రానున్నారు.
జిల్లాలో ఇటీవలే రామతీర్థం నీలాచలం కొండపై రాములోరి శిరస్సు ఖండన తర్వాత… జిల్లా పోలీస్ శాఖ అందున ఎస్పీ వైఫల్యం అంటూ పలు విమర్శలను కూడా శాఖ ఎదుర్కొంది.
అయితే.. సీఐడీ నుంచీ సిట్ కు కేసు దర్యాప్తు ను అప్పగించడంతో జిల్లా పోలీస్ శాఖ పై కాస్త ఒత్తిడి తగ్గిన సమయంలో.. రాష్ట్ర డీజీపీ రాక ప్రాధాన్యత సంతరించుకుంది.