నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం మొలచింతలపల్లి గ్రామంలో ఇసుక మాఫియా ను అడ్డుకున్నందుకు మహిళా VRA ను దుర్భాషలాడుతూ దాడి చేసిన టిఆర్ఎస్ పార్టీ నాయకుడ్ని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని భారతీయ జనతా పార్టీ కొల్లాపూర్ మండల అధ్యక్షులు తమటం సాయికృష్ణ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు మహిళల పైన టిఆర్ఎస్ నాయకుల ఆగడాలు శృతిమించిపోతున్నాయని, అధికార మదంతో మహిళల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్న టిఆర్ఎస్ గుండాలను జైలుకు పంపి వాళ్ళ ఆస్తులను ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
కుర్వ నాగమలయ్య అనే టీఆర్ఎస్ నాయకుడు మహిళా ఉద్యోగిపై దాడి జరిగి మూడు రోజులు అవుతున్నా కూడా కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గాని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గాని ఈరోజు వరకు ఖండించకపోవడంలో ఆంతర్యమేమిటో కొల్లాపూర్ ప్రజలకు స్పష్టం చేయాలని ఆయన కోరారు. బాధితుల పక్షాన ఉంటారో నిందితుల పక్షాన ఉంటారో తేల్చుకోవాలని వారు ఇద్దరు టిఆర్ఎస్ నాయకులను హెచ్చరించారు.
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు వెంటనే నిందితుడ్ని అరెస్టు చేసి రిమాండ్ కు పంపాలని బిజెపి డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో బాధిత మహిళ పక్షాన కొల్లాపూర్ ప్రజల సహకారంతో పోరాటం చేయడానికి బిజెపి వెనుకాడదని వారన్నారు.