29.7 C
Hyderabad
May 2, 2024 06: 20 AM
Slider నెల్లూరు

వి ఎస్ యు లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి

#vikramsimhapuri

కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలోని జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో పరాక్రమ ఆర్ శౌర్య దివాస్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య జి. ఎం.సుందరవల్లి ముఖ్యఅతిథిగా విచ్చేసి నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ అందరికి ఆదర్శప్రాయుడని స్వాతంత్రం రావటానికి ఆయన చేసిన సేవలు అమరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య పి. రామచంద్రా రెడ్డి, ప్రిన్సిపాల్ ఆచార్య జి. విజయానంద్ కుమార్ బాబు డి సి డి సి ఆచార్య సిహెచ్.విజయ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ కే.సునీత ఎన్ ఎస్ ఎస్ సమన్వయ కర్త డా. ఉదయ్ శంకర్ అల్లం, డాక్టర్ జి సుజయ్, డాక్టర్ సి హెచ్. సాయి ప్రసాద్ రెడ్డి ఆఫీసర్ చాముండేశ్వరి, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. తదనంతరం హైదరాబాద్ జాతీయ సమైక్యత శిబిరం లో పాల్గొన్న ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు, మహారాష్ట్ర 27 వ నేషనల్ యూత్ ఫెస్టివల్ లో పాల్గొన్న వాలంటీర్ల ను అభినందించారు.

Related posts

చంద్రబాబు పై మంత్రి పెద్దిరెడ్డి మనుషుల రాళ్ల దాడి

Satyam NEWS

కేసీఆర్ అధికారంలో ఉంటే ఇళ్లురావు, ఉద్యోగాలు రావు

Satyam NEWS

మద్యం, డబ్బుతో ఓటర్లను ప్రభావితం చేయలేరు

Satyam NEWS

Leave a Comment