27.2 C
Hyderabad
May 18, 2024 21: 29 PM
Slider నల్గొండ

న్యాయవాదుల మద్దతు కాంగ్రెస్ పార్టీకే

#uttamkumarreddy

న్యాయవాదుల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాముల రామిరెడ్డి వెల్లడి

ఈనెల 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో నల్లగొండ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కుందూరు రఘువీర్ రెడ్డి కి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ న్యాయవాదుల బార్ అసోసియేషన్ మద్దతు ప్రకటించింది.

బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాముల రామిరెడ్డి ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ గత శుక్రవారం జరిగిన బార్ అసోసియేషన్ సమావేశంలో ఈ మేరకు మెజారిటీ సభ్యులు తీర్మానించినట్లు చెప్పారు.తమ సంఘ మెజారిటీ సభ్యుల అభిప్రాయం మేరకు రఘువీర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరచాలని తీర్మానించామని సాముల రామిరెడ్డి అన్నారు.రఘువీర్ రెడ్డి గెలుపు కోసం తామంతా కృషి చేయడానికి నిర్ణయించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సాముల రామిరెడ్డి వెంట న్యాయవాదులు కాల్వ శ్రీనివాసరావు,నట్టే సత్యనారాయణ, అంబటి శ్రీనివాస్ రెడ్డి,నారపరాజు శ్రీనివాసరావు,చనగాని యాదగిరి, ఒట్టికూటి అంజయ్య,జుట్టుకొండ సత్యనారాయణ,నారాయణ రెడ్డి, లతీఫ్, రామలక్ష్మారెడ్డి,సైదా హుస్సేన్,చక్రాల వెంకటేశ్వర్లు,ఎం.ఎస్. రాఘవరావు, కమతం నాగార్జున,సుంకరి క్రాంతి కుమార్,కొట్టు సురేష్,ప్రదీప్తి,దీపిక, రమాదేవి,కమతం నాగార్జున,రామినేని వెంకటేష్,పాలేటి శ్రీనివాసరావు,అడవి రాముడు,ధూళిపాల శ్రీనివాసరావు, సురేష్ నాయక్,శంకర్ నాయక్,వెంకటేష్ నాయక్,శ్రీను నాయక్,మీసాల అంజయ్య,పిడమర్తి చంద్రయ్య,ఉదారి యాదగిరి,బట్టిపల్లి ప్రవీణ్,జక్కుల నవీన్, గొట్టే ప్రశాంత్,మద్దుల నాగేశ్వరరావు, పలువురు సీనియర్,జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

సర్ ప్రయిజ్ విజిట్: పల్లె ప్రగతి లో భాగస్వామ్యం

Satyam NEWS

సోషల్ డిస్టెన్సింగ్ తప్పని సరిగా పాటించాలి

Satyam NEWS

చిట్యాల రెవెన్యూ ఆఫీస్ ముందు రైతుల ధర్నా

Satyam NEWS

Leave a Comment