29.7 C
Hyderabad
May 1, 2024 06: 14 AM
Slider కృష్ణ

నందిగామ పట్టణంలో టీడీపీలోకి పెరిగిన వలసలు

#tangiralaswamya

ఇప్పటివరకు వైసీపీలో ఉన్న ప్రముఖ నేతలు ఆ పార్టీని వీడి పసుపు కండువాను కప్పుకున్నారు. నందిగామ పట్టణం రెండవ వార్డులో దాసరి సత్యం, దాసరి నాగరాజు, ముంగి కృష్ణ, దాసరి గోపి, ముంగి గోపి, ముంగి వెంకన్న, దాసరి సిద్ధ, ముంగి శివ, గంధసిరి కృష్ణ, దాసరి బాలయ్య, ముంగి కృష్ణ, దాసరి గోపాల్ మరికొందరు నేతలు ఫ్యాన్ వదిలి సైకిల్‌ ఎక్కారు. ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి తంగిరాల సౌమ్య పట్టణ టిడిపి నేతృత్వంలో వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తంగిరాల సౌమ్య విజయానికి మేము సైతం అన్నారు. రెండో వార్డులో పర్యటిస్తున్న నేపథ్యంలో  ఆ ప్రాంతానికి చెందిన వైసీపీ నాయకులు మూకుమ్మడిగా తరలివచ్చి మేము సైతం మీకు తోడుగా అంటూ తంగిరాల వెంట నడిచారు. వీరి రాకతో టీడీపీలో జోష్‌ పెరిగింది.

Related posts

Shocking News: పాలమూరు జిల్లా బిజెపి అధ్యక్షుడు రాజీనామా

Satyam NEWS

ఎస్ 5 నో ఎగ్జిట్ థియేట్రికల్ హక్కులకు భారీ అమౌంట్

Bhavani

పాలన చూడని మంత్రులు పవన్ గురించి మాట్లాడుతున్నారు

Satyam NEWS

Leave a Comment