28.7 C
Hyderabad
April 28, 2024 06: 48 AM
Slider పశ్చిమగోదావరి

ఏలూరుకు రానున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి

#eluru

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఏలూరు రానున్నారు. ఏలూరు ఇండోర్ స్టేడియంలో మంగళ వారం జరిగే భారీ బహిరంగ సభ లో ఆయన పాల్గొననున్నారు. ఆయన రాకను పురస్కరించుకుని స్టేడియం లో బహిరంగ సభ ఏర్పాట్లకు సంబంధించి ఏలూరు జిల్లా బి జె పి నాయకులు సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా 2024 ఎన్నికల్లో అభ్యర్థులను బరిలో దింపేందుకు రంగం సిద్ధం చేసేందుకే ఏలూరు లో నిర్వహించే బి జె పి సభ వెనుక అంతరార్థమ నే సంకేతాలని సమాచారం. ఇండోర్ స్టేడియం లో జరిగే సభ ఏర్పాట్లను దగ్గరుండి ఏలూరు పార్లమెంట్ బి జె పి  ఇంచార్జి గారపాటి సీతారామచౌదరి, జిల్లా బి జె పి అధ్యక్షులు సి హెచ్ విక్రమ్ కిషోర్, బి జె పి నాయకులు రామన పూడి శివ, కె కృష్ణ ప్రసాద్ చౌదరి తదితరులు పర్యవేక్షిస్తున్నారు.

Related posts

టీడీపీ నేతలపై దాడిని ఖండించిన చంద్రబాబునాయుడు

Satyam NEWS

ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

Satyam NEWS

కల్వకుర్తి దేవాలయాల్లో కిటకిటలాడిన భక్తజనం

Satyam NEWS

Leave a Comment