రిజర్వేషన్లు వద్దని కోరుతున్న రెండు ప్రధాన పార్టీలైన బీజేపీ, వైఎస్స్ఆర్సీలను గద్దె దించాలని విజయనగరంలో సమాజ్ వాదీ పార్టీ డిమాండ్ చేసింది. రాష్ట్ర పర్యటనలో భాగంగా విశాఖ నుంచీ విజయనగరరం వచ్చిన ఎస్పీ నేతలు జగదీష్, కిరణ్, తదితరులు నగరంలోనీ బ్లూ ఎర్త్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. విజయనగరం జిల్లా నుంచీ రెండు ఎంపీ స్థానాలకు, అయిదు అసెంబ్లీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని ఎస్పీ జాతీయ నేత డా. జగదీష్ తెలిపారు. విజయనగరం నుంచీ కరుణా కర్, వైజాగ్ నుంచీ డా. జాలాది విజయలను ఎంపీ అభ్యర్ధులుగా పోటీ చేస్తున్నారని తెలిపారు. ఈ నేపధ్యంలో మా పార్టీ అభ్యర్ధులను గెలిపించాలని కోరారు.
previous post
next post