42.2 C
Hyderabad
April 30, 2024 15: 13 PM
Slider కడప

24 న రాజంపేటకు చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్

#depakreddy

అన్నమయ్య జిల్లా రాజంపేట లో బుధవారం టీడీపీ జోనల్ కో ఆర్డినేటర్ దీపక్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి చమర్తి జగన్ మోహన్ రాజు, టీడీపీ రాజంపేట అసెంబ్లీ అభ్యర్థి సుగవాసి సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ జోనల్ కో ఆర్డినేటర్ దీపక్ రెడ్డి మాట్లాడుతూ రాజంపేటలో టీడీపీ విజయం ఖాయం అన్నారు. 11 మెజార్టీ నేషనల్ మీడియా,టీడీపీ స్వంత సర్వే లో ఎన్డీయే కూటమి అధికారంలోకి ఖాయం అని తేల్చిందన్నారు.

జొన్ 4 లో అన్నీ నియోజక వర్గాల్లో టీడీపీ అభ్యర్థులు మెజార్టీ పై ధీమా వ్యక్తం చేస్తున్నారన్నారు. రాష్ట్ర టీడీపీ కార్యదర్శి బత్యాల చెంగల రాయుడు రెండు రోజుల్లో పార్టీకి పనిచేస్తారని సమాచారం ఉందన్నారు. ఇందుకు సంబంధించి అధిష్టానం నుంచి సమాచారం ఉందన్నారు. కొన్ని ప్రాంతాల్లో చెలరేగిన అసమ్మతి తొలగిందని అందరూ కలిసి కట్టుగా పార్టీ గెలుపు కోసం పనిచేస్తారన్నారు.

పార్టీని నమ్ముకున్న చమర్తి జగన్ మోహన్ రాజు లాంటి వారికి అధికారంలోకి వచ్చిన తరువాత మంచి గుర్తింపు ఉంటుందనీ హామీ ఇచ్చారు. రాజంపేట లో ఈనెల 24 వ తేదీన టీడీపీ అభ్యర్ధి నామినేషన్ దాఖలు కార్యక్రమం కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్నట్లు టీడీపీ రాజంపేట అసెంబ్లీ అభ్యర్థి సుగవాసి సుబ్రమణ్యం తెలిపారు. సాయంత్రం జరిగే బహిరంగ సభ కు, నామినేషన్ కార్యక్రమం కు అందరూ తరలి రావాలని పిలుపు ఇచ్చారు.

Related posts

డబుల్ ధమాకా: వైసిపికి చెంప దెబ్బ టిడిపికి గోడ దెబ్బ

Satyam NEWS

రాజశ్యామల మాతకు జగన్ ప్రత్యేక పూజలు

Satyam NEWS

వనపర్తిలో జిల్లా కోర్టు కాంప్లెక్స్ కోసం స్థలం పరిశీలన

Satyam NEWS

Leave a Comment