అన్నమయ్య జిల్లా రాజంపేట ఆకేపాటి భవన్లో మంగళ వారం స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ సుబ్బారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాజంపేట నియోజకవర్గం లో వైసీపీ నుంచి టిడిపిలో చేరారని చెప్పడం అవాస్తమన్నారు. వారంతా గతంలో టిడిపిలో నుంచి వైసీపీలో కి ఓ పథకం ప్రకారం వచ్చిన వారేనన్నారు. వారి వెంట నిజమైన కార్యకర్తలు ఎవరూ వెళ్ళ లేదని తెలిపారు.
వైసిపి పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవారు ఎవరు పార్టీ వీడలేదనీ సృష్టం చేశారు. దీనిపై ఎల్లో మీడియా అనవసర దుష్ప్రచారం చేస్తోందన్నారు. రాజంపేట వైసిపి ఎమ్మెల్యేగా ఆకే పాటి అమర్నాథ్ రెడ్డి,ఎంపీ గా మిథున్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవడం తథ్యం అని చెప్పారు. ఇంకా ఈ సమావేశంలో వైసీపీ నేతలు పాపినేని విశ్వ నాథ రెడ్డి,బొల్లినేని రామ్మోహన్ నాయుడు,దండుగోపి, దాసరి పెంచలయ్య,రాజు తదితరులు పాల్గొన్నారు.