36.2 C
Hyderabad
April 27, 2024 22: 21 PM
Slider తూర్పుగోదావరి

జగన్ ఓడిపోతేనే గ్రామపంచాయితీలకు మనుగడ

#yvbrajendraprasad

విద్యుత్ బిల్లుల పేరుతో గ్రామపంచాయతీల నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా దోచి వేస్తున్నదని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి.  ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్యాల రావు సర్పంచ్ ల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్ జిల్లా రాష్ట్ర నాయకులు ఈ మేరకు కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ ని కలిసి సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలపై 16 డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలోని మైనర్ గ్రామపంచాయతీలకు గతంలో ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైయస్ రాజశేఖర్ రెడ్డి, నారా చంద్రబాబు ఇచ్చిన విధంగానే ఉచిత విద్యుత్తును ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యుత్ బిల్లుల పేరుతో అడ్డగోలుగా గ్రామపంచాయతీల్ని జగన్ ప్రభుత్వం దోచివేస్తున్నదని ఆయన అన్నారు.

గత అన్ని ప్రభుత్వాలు ఒక పద్ధతిలో నడిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి  నిరంకుశ ప్రభుత్వం మాత్రం  మరో పద్ధతిలో గ్రామపంచాయతీల్ని నిర్వీర్యం చేసి, గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడేలా చేసి, సర్పంచ్ లను ఉత్సవ గ్రహాలుగా మార్చి వేసిందని రాజేంద్రప్రసాద్ అన్నారు. అలాగే  2 నెలల్లో జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ- పార్లమెంట్ ఎన్నికల్లో స్థానిక సంస్థల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించడానికి తీవ్రంగా కృషి చేయాలని, రాష్ట్రంలోని అన్ని పార్టీలకు వైయస్సార్సీపి, బిజెపి, టిడిపి, జనసేన,సిపిఎం, సిపిఐ లకు చెందిన సర్పంచులకు, ఎంపీటీసీలకు, ఎంపీపీ లకు, జడ్పిటిసి లకు, కౌన్సిలర్ కు, కార్పొరేటర్స్ కు రాజేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు.

అలాగే  “ఇది చాలా తీవ్రమైన నిర్ణయం అని మాకు తెలుసు కానీ మాకు మరో దారి లేక ఈ తీవ్ర నిర్ణయాన్ని తీసుకున్నాము.  జగన్మోహన్ రెడ్డి మా నిధులు, అధికారాలను, విధులను దొంగిలించి వేసినారు. అవి తిరిగి ఇవ్వమని రాజకీయాలకు అతీతంగా, రాష్ట్రవ్యాప్తంగా మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని పార్టీలకు చెందిన సర్పంచులు,ఎంపీటీసీలు,ఎంపీపీలు, జడ్పిటిసిలు, కౌన్సిలర్స్,కార్పొరేటర్స్ గత మూడు సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు, ఆందోళనలు,  పోరాటాలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు” అని రాజేంద్రప్రసాద్ విమర్శించారు.

12,918 గ్రామాలలోని  3 కోట్ల 50 లక్షల మంది గ్రామీణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, మేము స్థానిక ప్రజాప్రతినిధులం  ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయి, అసమర్థులుగా, చేతకాన్ని వాళ్ళలా మా గ్రామాల ప్రజల చేత తీవ్ర నిందలు పడ్డాము. కానీ తప్పు మాది కాదు – జగన్ ది” అని రాజేంద్రప్రసాద్ అన్నారు. అందుకే మళ్లీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పల్లెలు శిధిలమైపోయి, గ్రామీణ ప్రజలు నాశనమైపోతారని, స్థానిక ప్రజా ప్రతినిధులు అన్యాయమైపోతారని, అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి తగిన బుద్ధి చెప్పడానికి, గ్రామీణ ప్రజలకు తగిన న్యాయం చేయడానికి, మనల్ని మనం కాపాడుకోవడానికి ఈ కఠిన నిర్ణయం ఈ రోజున తీసుకోవడం జరిగిందని రాజేంద్రప్రసాద్ చెప్పారు.

వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు మాట్లాడుతూ ” రెండు నెలల్లో జరగబోయే ఏపీ అసెంబ్లీ- పార్లమెంట్ ఎన్నికల్లో అధికార వైయస్సార్సీపి ప్రభుత్వాన్ని ఓడించడానికి రాష్ట్రంలోని అన్ని పార్టీలకు చెందిన ముఖ్యంగా అధికార పార్టీ అయిన వైయస్సార్సీపి పార్టీకి చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు,జడ్పీటీసీలు,కౌన్సిలర్స్,కార్పొరేటర్స్ తీవ్రంగా కృషి చేయాలని, మన గ్రామాల, పట్టణ ప్రజలకు జగన్ గారు చేస్తున్న అన్యాయాన్ని సాక్ష్యాధారాలతో సహా వివరించి చెప్పి జగన్ కి వ్యతిరేకంగా మన ప్రజలతో ఓటు వేయించి ఓడించాలని  “జగన్ ఓడితేనే – మన మనుగడ” అనే నినాదంతో అన్ని పార్టీల సర్పంచులు, ఎంపీటీసీలు,ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్స్, కార్పొరేటర్స్ ఈ రెండు నెలలు చిత్తశుద్ధితో పట్టుదలగా  తమ తమ గ్రామాలలో,  పట్టణాలలో పనిచేయాలని” లక్ష్మీ ముత్యాలరావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

కన్ఫ్యూజన్: తికమక వ్యవహారంలో చిక్కుకున్న పాలనాయంత్రాంగం

Satyam NEWS

భద్రాచలానికి రూ. వెయ్యి కోట్ల హామీ ఏమైంది..?

Bhavani

గోండు రైతులకు ఉచితంగా జొన్న విత్తనాల పంపిణీ

Satyam NEWS

Leave a Comment