38.2 C
Hyderabad
April 28, 2024 22: 50 PM
Slider ఖమ్మం

పాలేరు అసెంబ్లీ నుండి సిపిఎం పోటీ

#cpmkhammam

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుండి సిపిఎం పార్టీ పోటీ చేస్తుందని సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్‌ తెలియజేశారు. స్థానిక సుందరయ్య భవనం నందు జరిగిన పాలేరు నియోజకవర్గ స్థాయి సోషల్‌ మీడియా కమిటీ సమావేశంలో వారు ముఖ్య అతిగా పాల్గొని మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రజలు టిఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులు అవలంబిస్తున్న ధన రాజకీయాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. పాలేరులో సిపిఎం పార్టీ అభ్యర్థి యొక్క విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని అన్నారు. ఎర్రజెండా ఔనత్యాన్ని చాటే విధంగా ప్రతి ఒక్కరు పనిచేయాలన్నారు.

పాలేరు నియోజకవర్గంలో ప్రస్తుతం పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ స్వలాభం కోసం రాజకీయాలను బ్రష్టు పట్టిస్తున్నారని అన్నారు. మతం, డబ్బు, అవకాశవాద విధానాలతో ఎన్నికల్లోకి దిగుతున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో డబ్బులతో ఓట్లు కొనుక్కోవచ్చు అనుకునే వారికి పాలేరు నియోజకవర్గ ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ప్రజాస్వామ్య పద్ధతిలో నిజాయితీగా నిక్కచ్చిగా రాజకీయాలు చేస్తున్న వారికి పట్టం కట్టి రాష్ట్రంలోనే ఒక సంచలన తీర్పుని పాలేరులో ఇవ్వాలని వారు కోరారు. ఈ ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థులను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు.ఈ కార్యక్రమంలో సోషల్‌ మీడియా రాష్ట్ర నాయకులు పిట్టల రవి, సిపిఎం ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు ఎస్‌. నవీన్‌ రెడ్డి, సోషల్‌ మీడియా నియోజకవర్గ బాధ్యులు బోడపట్ల కార్తీక్‌, పొన్నం వెంకటరమణ, యమిని ఉపేందర్‌, వేటుకూరి సతీష్‌, ఉమేష్‌, నేరుసుల వెంకటేష్‌, ప్రవీణ్‌, పందిరి వీరారెడ్డి, తాటి వెంకటేశ్వర్లు, నరేష్‌ కుమార్‌, లెనిన్‌ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కరోనా సోకిందని మా కుటుంబాన్ని అందరూ వదిలేశారు

Satyam NEWS

సెల్ ఫోన్ల రికవరీలో కామారెడ్డి టాప్: జిల్లా ఎస్పీ సిందూశర్మ

Satyam NEWS

శేరిలింగంపల్లి లో చురుకుగా అభివృద్ధి కార్యక్రమాలు

Satyam NEWS

Leave a Comment