మాన్సాస్ సంస్థల వ్యవస్థాపకులు డా. పీ. వీ. జీ రాజు శతజయంతి ఉత్సవాల ముగింపు నేపధ్యంలో అయిదుగురు విశిష్ట వ్యక్తులకు ఘనంగా సన్మానం చేస్తున్నామని క్షత్రియ పరిషత్ కోశాధికారి రామరాజు తెలిపారు. ఈ మేరకు విజయనగరం అయోధ్య మైదానం వద్ద ఉన్న క్షత్రియ పరిషత్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. గతేడాది మే 1 నుంచి డా పీ. వి. జీ రాజు శత జయంతి ఉత్సవాలు మొదలయ్యాయని, ఈ నెల 2వ తేదీన ముగింపు ఉత్సవం క్షత్రియ పరిషత్ భవన్ లో జరుగుతుందన్నారు. అదే రోజు డా. పీ. వీ. జీ ఆశయాలను మాన్సాస్ లక్ష్యాన్ని దశ దిశలా చాటిన అయిదుగురు వ్యక్తులను సన్మానిస్తున్నట్టు, ఆ కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ముఖ్య అతిధిగా హాజరవుతారని పరిషత్ నిర్వాహకులు తెలిపారు.