27.7 C
Hyderabad
May 22, 2024 06: 32 AM
Slider ముఖ్యంశాలు

పీ.వీ.జీ రాజు శత జయంతి ముగింపు రోజున విశిష్టులకు సత్కారం

#pvgraju

మాన్సాస్ సంస్థల వ్యవస్థాపకులు డా. పీ. వీ. జీ రాజు శతజయంతి ఉత్సవాల ముగింపు నేపధ్యంలో అయిదుగురు విశిష్ట వ్యక్తులకు ఘనంగా సన్మానం చేస్తున్నామని క్షత్రియ పరిషత్ కోశాధికారి రామరాజు తెలిపారు. ఈ మేరకు విజయనగరం అయోధ్య మైదానం వద్ద ఉన్న క్షత్రియ పరిషత్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. గతేడాది మే 1 నుంచి డా పీ. వి. జీ రాజు శత జయంతి ఉత్సవాలు మొదలయ్యాయని, ఈ నెల 2వ తేదీన ముగింపు ఉత్సవం క్షత్రియ పరిషత్ భవన్ లో జరుగుతుందన్నారు. అదే రోజు డా. పీ. వీ. జీ  ఆశయాలను మాన్సాస్ లక్ష్యాన్ని దశ దిశలా చాటిన అయిదుగురు వ్యక్తులను సన్మానిస్తున్నట్టు, ఆ కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ముఖ్య అతిధిగా హాజరవుతారని పరిషత్ నిర్వాహకులు తెలిపారు.

Related posts

కౌలు రైతులు సమస్యలు పట్టని ప్రభుత్వాలు

Murali Krishna

మే 28న ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ

Satyam NEWS

అమిత్ షా, ఆర్ఎస్ఎస్ లపై దిగ్విజయ్ పశ్రంసల జల్లు

Sub Editor

Leave a Comment