అకాల వర్షాలు, ఎర్రనల్లి, తామర పురుగు వల్ల లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలు నష్టపోయిన కౌలు రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవడంలో విఫలమయ్యాయని తెలంగాణ రాష్ట్ర కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పోజ్ సూర్యనారాయణ ఆరోపించారు. ఖమ్మం లో అడప రామకోటయ్య అధ్యక్షతన జరిగిన కౌలు రైతుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులు తిరిగి రబి పంటకు పెట్టుబడి లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రబి పంటకు విత్తనాలు, ఎరువులు ప్రభుత్వం నుండి ఉచితంగా రైతులకు అందజేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. బ్యాంకు రుణాలు, రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ కౌలు రైతులకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు అడపా రామకోటయ్య, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు దొండపాటి రమేష్, కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జక్కుల రామారావు, బి రమేష్, వెంకటేశ్వర్లు, సీతారాములు, తదితరులు పాల్గొన్నారు.
previous post