35.2 C
Hyderabad
May 21, 2024 17: 37 PM
Slider హైదరాబాద్

డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

#amberpet

అంబర్ పేట డివిజన్ నరేంద్ర నగర్ లో 30 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా వేయనున్న డ్రైనేజ్  నిర్మాణ పనులను అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబర్ పేట డివిజన్ లో అవసరమైన ప్రతి చోట నూతన డ్రైనేజీ లైన్లు ఏర్పాటు చేస్తున్నామని,స్థానిక ప్రజలకు ఏటు వంటి ఇబ్బంది కలగకుండా డ్రైనేజ్ పనులను త్వరిత గతిన పూర్తి చేయ్యాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అప్పటి జనాభాకు అనుగుణంగా ఉన్న డ్రైనేజీ పైప్ లైన్ తో ఇప్పటి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతుండడంతో తీవ్రంగా సమస్య ఉన్న చోట నూతన డ్రైనేజీ లైన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ ఏఈ మజీద్, వర్క్ ఇన్స్పెక్టర్ దుర్గ, లైన్మెన్ రాజేష్, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ సీనియర్ నాయకులు, అమనురీ సతీష్, సంతోష్ చారి, మహిలనాయకులు స్వాతి, కార్యకర్తలు, స్థానిక బస్తీ ప్రజలు స్వాతి, అనసూయ, లక్ష్మి, అనురాధ, మౌనిక, రేఖ, లలిత రేవతి, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట్

Related posts

మట్టిరోడ్డు లేకుండా చేస్తా: మంత్రి గంగుల కమలాకర్

Satyam NEWS

విధినిర్వహణలో మానవత దృక్పథంతో మెలగాలి

Satyam NEWS

వనపర్తిలో భూకబ్జా పై బి.సి కమిషన్ సభ్యుడు ఆచారికి ఫిర్యాదు

Satyam NEWS

Leave a Comment