సూర్యాపేట జిల్లాలో అక్రమంగా వాహనాల ద్వారా రేషన్ బియ్యం తరలిస్తున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మం నుండి హైదరాబాద్ కు తరలిస్తున్న 12 లక్షల రూపాయల విలువైన 30 టన్నుల పిడిఎస్ రేషన్ బియ్యం సూర్యాపేట జనగాం క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు పట్టుకున్నారు. నలుగురు నిందితుల అరెస్ట్ కాగా ఒకరు పరారీలో ఉన్నారని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. నిందితుల వద్ద నుండి ఒక లారీ మూడు అశోక్ లేలాండ్ వాహనాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టు ఆదేశాలతో రిమాండ్ కు తరలించారు.