29.7 C
Hyderabad
April 29, 2024 08: 01 AM
Slider మహబూబ్ నగర్

వనపర్తిలో భూకబ్జా పై బి.సి కమిషన్ సభ్యుడు ఆచారికి ఫిర్యాదు

#BCCommission

వనపర్తి  పట్టణంలో  3.20గుంటల దేవాదాయశాఖ భూమిని అధికారులతో కుమ్మకై కబ్జా చేశారని అఖిలపక్షం నాయకులు జాతీయ బిసి కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి పిర్యాదు చేశారు. ఈ స్థలం పూర్తి వివరాలను వివరిస్తూ  కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

కబ్జా అయిన భూమిని ఆచారికి చూపారు. ఈ వివాద స్థలం పై విచారణ జరిపించాలని అధికారులను గతంలోనే ఆదేశించడం జరిగిందని, మరోసారి అధికారులతో సమీక్ష జరిపి భాద్యులపై చర్యలు తీసుకుంటామని అఖిలపక్షానికి హామీ ఇచ్చారని నేత నందిమల్ల అశోక్ విలేకరులకు తెలిపారు.

ఈ కార్యక్రమంలో న్యాయవాది రావుల హేమవర్ధన్ రెడ్డి, అఖిలపక్షం నాయకులు కాంగ్రెస్ నుండి న్యాయవాది కిరణ్ కుమార్, శంకర్ నాయక్,సతీష్  యాదవ్,బ్రహ్మము, తెలుగుదేశం నుండి వెంకటయ్య యాదవ్, నందిమల్ల అశోక్,టి.జె.ఎస్ తెలంగాణ జనసమితి నుండి ఖాదర్ పాషా,వై.ఎస్.ఆర్ నుండి వెంకటేష్,మధులత, మధుమిత,సతీష్ పట్టణ అభివృద్ధి కమిటీ నుండి తిరుపతయ్య యాదవ్,ప్రభాకర్ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

కరోనా ఇన్ఫెక్షన్ గరిష్ట స్థాయికి చేరిన చైనా

Satyam NEWS

కోనసీమను అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలి

Satyam NEWS

జ్ఞాన సమాజాన్ని నిర్మించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే

Satyam NEWS

Leave a Comment