టిఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతామని, రానున్నరోజుల్లో కాంగ్రెస్ కు పూర్వవైభవo తీసుకువస్తామని తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జి రమేష్ మహరాజ్ పేర్కొన్నారు.
సోమవారం తాండూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వికారాబాద్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు సతీష్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు అమీర్ అబ్దుల్లా, తాండూరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయ అశోక్ కుమార్, ఉపాధ్యక్షుడు మొయిన్ లను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జి రమేష్ మహరాజ్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం యువజన విభాగం, ఎన్ యెస్ యూ ఐ సంయుక్తంగా పని చేయాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేలా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుడిలా పని చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బిసి సెల్ అధ్యక్షుడు ఉత్తమ్ చంద్, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్, సత్యమూర్తి, సర్దార్ ఖాన్, శంకరప్ప, రాములు తదితరులు పాల్గొన్నారు.