34.7 C
Hyderabad
May 5, 2024 02: 31 AM
Slider విజయనగరం

తెలుగు మ‌హిళా ఆధ్వ‌ర్యంలో వంట-వార్పు..!

Vanta Varpu

అధాకార పార్టీ అనుసరిస్తున్నతీరుతెన్నులపై ప్రతిపక్ష పార్టీ ఆందోళనల బాట పట్టింది. ఈ మేరకు కేంద్ర మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు నియోజకవర్గ మైన విజయనగరంలో టీడీపీ వంట-వార్పు ఆందోళన చేపట్టింది. నగరంలో ని గంటస్తంబం వద్ద ఆ పార్టీ నేతలు ఐవీపీ రాజు, ఆదితి గజపతిరాజు, విజ్జపు ప్రసాద్ నేతృత్వంలో టీడీపీ శ్రేణులు అధికార పార్టీ వ్యవహరిస్తున్నవిధానాలకు వ్యతిరేకంగా వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. గ్యాస్ ధరలు భారీగా పెంచినందుకు నిరసనగా
తెలుగు మహిళ ఆధ్వర్యంలో విజయనగరం గంటస్తంభం జంక్షన్ వద్ద “వంటా – వార్పు” కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వన్ టౌన పోలీసులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. వన్ టౌన్ ఎస్ఐలు కిరణ్, దేవిలు టిడీపీ శ్రేణులు చేస్తున్నఆందోళన కార్యక్రమాన్నిఅడ్డుకునేందుకు యత్నించ‌గా కాసేపు అక్క‌డ గంద‌ర‌గోళం ఏర్ప‌డింది.

Related posts

ఆగ‌స్ట్ 12న ఓటీటీ లో వ‌స్తోన్న లెస్బియ‌న్  చిత్రం `హోలీ వుండ్‌`

Satyam NEWS

“కళ్యాణం కమనీయం” చిత్రం నుంచి “హో ఎగిరే” లిరికల్ సాంగ్ రిలీజ్

Bhavani

జగన్ ప్ర‌భుత్వ‌ హ‌యాంలో ప్ర‌తీ పేదవానికి ల‌బ్ది

Satyam NEWS

Leave a Comment