29.7 C
Hyderabad
May 22, 2024 02: 36 AM
Slider మహబూబ్ నగర్

బూడిదైన పత్తి: ఓ రైతు కుటుంబానికి తీరని నష్టం

#cotton

ఆరుగాలం కష్టపడి పండించిన  దాదాపు నాలుగు క్వింటాళ్ల పత్తి బూడిదయింది. నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం రాచూర్ గ్రామంలో శుక్రవారం రైతు పాముల బాలస్వామి ఇంట్లో నాలుగు క్వింటాళ్ల పత్తి అగ్నికి ఆహుతి అయింది. రైతు పాముల బాలస్వామి తో పాటు కుటుంబీకులు వ్యవసాయ పనిలో భాగంగా పొలానికి వెళ్లారు. తాళం వేసిన ఇంట్లో నుండి పొగలు రావడంతో గ్రామస్తులు విషయాన్ని బాలస్వామి కి తెలిపారు. వెంటనే ఇంటికి చేరుకున్న బాలస్వామి కుటుంబీకులు పత్తి దగ్ధం ఆయన విషయాన్ని జీర్ణించుకోలేక లబోదిబోమన్నారు. ఆరుగాలం కష్టపడి పండించుకున్న పంట చేజారడంతో రైతు బతుకు జీవుడా అంటున్నాడు. ప్రభుత్వం వారి ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

Related posts

కాప్రాలో ఘనంగా జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు

Satyam NEWS

అచ్చన్నాయుడి బెయిల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

Satyam NEWS

తెలంగాణ వాటర్ మెన్: అపర భగీరథుడికి రైతుల కృతజ్ఞతలు

Satyam NEWS

Leave a Comment