ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనరంజక పాలన అందిస్తున్నారని గ్రేటర్ వైసిపి నాయకుడు సర్వేపల్లి రవికుమార్ అన్నారు. మంగళవారం జగన్మోహన్ రెడ్డి జన్మదినం ఈ సందర్భంగా నాయకులతో కలిసి అనాథ ఆశ్రమంలో పేదలకు పండ్లు పంపిణీ చేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు సుదీర్ఘ పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చాకఅందరి కష్టాలు తీర్చేందుకు నవరత్నాలు అమలు చేసుతున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అన్ని ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తున్న జగన్మోహన్ రెడ్డి మరో ఇరవై సంవత్సరాల పాటు అధికారంలో ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాహుల్,అమీర్, నవీన్, సతీష్, భాస్కర్, బీరయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి