రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో వీసీల నియామకాల్లో రాజకీయ జోక్యం ఉందన్న ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆరోపణలను కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తోసిపుచ్చారు. తన జోక్యంపై ఆధారాలు ఇవ్వాలని, లేదంటే రాజీనామా చేయాలని గవర్నర్ సవాల్ విసిరారు. తన జోక్యంపై ఆధారాలు ఉంటే పదవి నుంచి వైదొలగేందుకు కూడా తాను సిద్ధమని చెప్పారు. కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం (కేరళ సీఎంఓ) రాష్ట్రంలో స్మగ్లింగ్ను ప్రోత్సహిస్తోందని గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కూడా ఆరోపించారు. ఖాన్ మాట్లాడుతూ, “నేను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు, కానీ ఇప్పుడు అన్ని రకాల స్మగ్లింగ్ కార్యకలాపాలను ముఖ్యమంత్రి కార్యాలయం ప్రోత్సహిస్తున్నట్లు నేను చూస్తున్నాను.” అని అన్నారు.
CMOలో కూర్చున్న వ్యక్తులు అనర్హులను నియమించాలని కన్నూర్ విశ్వవిద్యాలయం VCని ఆదేశించారని అయితే అందులో నేనెప్పుడూ జోక్యం చేసుకోలేదని గవర్నర్ తెలిపారు. ‘రాష్ట్ర ప్రభుత్వం, సిఎంఒ, సిఎంకు సన్నిహితులు స్మగ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడితే తప్పకుండా నేను జోక్యం చేసుకునే అవకాశం ఉందని ఖాన్ అన్నారు. తన ఆరోపణలను నిరూపించలేకపోతే రాజీనామాకు సిద్ధమా అని ఖాన్ ముఖ్యమంత్రికి బహిరంగంగా సవాలు విసిరారు. కేరళ గవర్నర్ ఖాన్ మాట్లాడుతూ, “ఆర్ఎస్ఎస్ వ్యక్తులను తీసుకురావడానికి నేను ఈ పని చేస్తున్నానని చెబుతున్నారు. కానీ, నా అధికారాన్ని ఉపయోగించి ఒక్క ఆర్ఎస్ఎస్ వ్యక్తిని వైస్ ఛాన్సలర్గా నామినేట్ చేసి ఉంటే.. రాజీనామాకు సిద్ధమేనని ఆయన సవాల్ చేశారు.