రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల మార్క్ ను దాటాయి. ఉదయం నుంచే మొదలవుతున్న ఉక్కపోత తో ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. రాబోయే 5 రోజుల పాటు మరింత తీవ్రంగా ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అదే విధంగా నేటి నుంచి 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను ఐఎండీ జారీ చేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు అధికంగా వడగాడ్పుల ముప్పు ఉందని అంచనా వేస్తున్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
previous post