పాకిస్తాన్ తో శాంతి నెలకొల్పుకోవడం భారత్ కే మేలు చేస్తుందని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
పాకిస్తాన్ తో మంచి సంబంధాలు కలిగి ఉంటే భారత్ నేరుగా మధ్య ఆసియాతో సంబంధాలు పెట్టుకోవచ్చునని ఆయన అన్నారు.
మధ్య ఆసియా దేశాలతో నేరుగా సంబంధాలు కలిగి ఉండటం ద్వారా భారత్ కు ఆర్ధికంగా ఎంతో మేలు జరుగుతుందని ఆయన తెలిపారు.
అందుకోసమే పాకిస్తాన్ తో భారత్ శాంతి కోసం ప్రయత్నించాలని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఇస్లామాబాద్ భద్రతా సదస్సును నేడు ఆయన ప్రారంభిస్తూ ప్రారంభోపన్యాసం చేశారు.
తాను అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ తో శాంతి చర్చలు జరిపేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.