అపర వాల్మీకి, సిధ్ధ సమాజ వ్యవస్థాపకులు ,పరమపూజనీయ శ్రీశ్రీశ్రీ స్వామి శివానంద పరమహంసల ప్రియ శిష్యులు, మౌన స్వామి శ్రీశ్రీశ్రీ స్వామి రామానందుల వారి మహా సమాధి ఆరాధనోత్సం..అన్ని చోట్ల జరుగుతోంది.
ఈ సందర్భంలో విజయనగరంలో స్వామి శ్రీరామానంద యోగజ్ఞాన ఆశ్రమ పీఠాధిపతి రిటైర్డ్ డీఎంఅండ్ హెచ్ ఓ డా.వీ.వెంకటేశ్వరరావు శ్రీ గురూజీ చే నెలకొల్పబడిన ధ్యానమందిరం లో కూడా స్వామీజీ మహా సమాధి ఆరాధనోత్సం సందర్భంగా 12 గంటల పాటు నిర్విరామంగా ఈ నెల 16వ తేదీన సాయంత్రం 5.30 నుంచీ మరుసటి ఉదయం 6 గంటల వరకూ అఖండజపం జరిగింది.
1993 మార్చి 9 వ తేదీన శ్రీశ్రీశ్రీ స్వామి రామానంద పరమ హంసల వారు సమాధి పొందారు. ఆ రోజే కామన్నవలస అశ్రమంలో ఆశ్రమ పీఠాధిపతి బ్రహ్మర్షి శ్రీ గురూజీ అఖండజపం మొదలు పెట్టారు. అదే ఏడాది లో స్వామీజీ సమాధి పొందిన తదుపరి మంగళవారం 16 వ తేదీ నాడు విజయనగరం లో ఇద్దరే ఇద్దరు శిష్యులైన గోపీ ,రాములతో అఖండజపం ప్రారంభమైంది.
అప్పటి నుంచీ.. నిర్విరామంగా సరిగ్గా ఇవాళ్టి కి 28 ఏళ్లు పూర్తయ్యింది. ఈ తరుణంలో ఆశ్రమ పీఠాధిపతి శ్రీ గురూజీ ఆదేశాల తో విజయనగరం ధ్యానమందిరంలో అఖండ ప్రాణాయామ జపం ప్రారంభించారు…స్థానిక శిష్య బృందం.
ఈ జపానికి.. ప్రముఖ వైద్యులు, మిమ్స్ లో పని చేస్తున్న డా.సుబ్రహ్మణ్యందంపతులు, ఆర్మీ ఉద్యోగి భాస్కర్ దంపతులు, ప్రభుత్వ ఉద్యోగి రామకృష్ణ దంపతులతో పాటు 104 ఉద్యోగిని వరలక్ష్మి, శర్మ ,రవి ,మంగారావు, తదితర శిష్యులు హాజరైయ్యారు.