సరిగ్గా ఈ రోజుటికి దేశంతో పాటు ఏపీలోనూ కరోనా అలజడినే సృష్టించింది. దాదాపు 10నెలల పాటు అయిదు సార్లు లాక్ డౌన్ తో దేశం మొత్తం స్తంభించి పోయింది.
గత ఏడాది నవంబర్ లో కాస్త కాలేజీలు తెరుచుకోగా…మెల్లమెల్ల పాఠశాలలూ తెరుచుకోవడం ప్రారంభించాయి. అయతే అంతా సర్దుమణగిందనుకున్న వేళ…కొనసీమీలో కరోనా మళ్లీ విజృంభించిందన్న వార్తలు ఆ సీమనే ఓ రకంగా అలజడినే సృష్టిస్తున్నాయి.
నిన్నకి నిన్న హైదరాబాద్లోని ఓ పాఠశాల విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా.. ఇప్పుడు తాజాగా తూర్పుగోదావరి జిల్లా మలికిపురం యూపీ స్కూల్ లో కరోనా కలవరం మొదలైంది.
ఈ గ్రామంలో పాఠాశాలకు వెళ్లిన 24 మంది విద్యార్దులకు కరోనా పాజిటివ్గా వైద్యులు నిర్ధారించారు. కరోనా బారినపడ్డ విద్యార్థులు, టీచర్లు ను ప్రత్యేక చికిత్స కోసం ప్రభుత్వవైద్యశాలకు తరలించారు.