మరో కొత్త జిల్లా ఏర్పాటు కు జగన్ ప్రభుత్వం పనులను వేగవంతం చేసింది. నిన్నటి వరకూ కొత్త జిల్లాల ఏర్పాటు లో కలెక్టర్ ఆఫీసు, డీఆర్వో ఆఫీసు ల భవనాలకై కసరత్తును రెవెన్యూశాఖ ఇప్పటికే పూర్తి చేసింది. తాజాగా పోలీసు శాఖ….కొత్త పీఎస్ ల ఏర్పాట్లు, అలాగే కొత్త డివిజన్ ల ఏర్పాటు స్థల పరిశీలనకై అన్ని జిల్లాల పోలీసు సూపరెంటెండెంట్ లు పనులు ప్రారంభించారు.
ప్రతీ రోజూ అన్ని జిల్లాల ఎస్పీలతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు కూడ. అందులి భాగంగా ఉత్తరాంధ్ర లో విజయనగరం జిల్లా ఎస్పీ దీపికా..ఈ మేరకు మన్యం జిల్లా గా రూపాంతరం చెందనున్న పార్వతీ పురాన్ని పరిశీలించారు.జిల్లాల పునర్విభజనలో భాగంగా పార్వతీపురం ఏర్పాటు కానున్న పోలీసు కార్యాలయాలు, పోలీసు స్టేషను భవనాలను జిల్లా ఎస్పీ దీపికా సందర్శించారు. కొత్త స్టేషన్ లల ఏర్పాటుకు సంబంధించి వాటిలో మౌలిక వసతులను పరిశీలించారు. అలాగే చేపట్టాల్సిన అభివృద్ధి చర్యలపై శాఖా సిబ్బంది కి పలు సూచనలు చేశారు.ఈ మేరకు ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ సిబ్బంది తో స్థలాలను పరశీలించారు.
జిల్లా ఎస్పీ వెంట పార్వతీపురం డిఎస్పీ .సుభాష్, ఎస్బీ సీఐ ఎన్.శ్రీనివాస రావు, పార్వతీపురం సీఐ విజయ ఆనంద్, పోలీసు హౌసింగ్ బోర్డు ఇంజనీర్లు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.