29.7 C
Hyderabad
May 1, 2024 04: 29 AM
Slider మహబూబ్ నగర్

మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్యాయత్నానికి గౌడ సంఘం ఖండన

#gowdassociation

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు ఆనంద్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడు, మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై  జరిగిన హత్యాయత్నం కుట్రను ఖండించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై జరిగిన హత్యాయత్న కుట్రను చేదించిన తెలంగాణ పోలీసువారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా లో ప్రదర్శన నిర్వహించారు. పేద ప్రజల కోసం గత 8 సంవత్సరాలుగా MLA గా, మంత్రిగా అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రి  శ్రీనివాస్ గౌడ్ పై హత్య రాజకీయాలకు పాల్పడడం దారుణమని యన అన్నారు.

తెలంగాణ ఉద్యమంలో తెగించి కొట్లాడి ప్రజా మద్దతుతో ముందుకు దూసుకుపోతూ మహబూబ్ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మంత్రి ఎదుగుదలను ప్రత్యర్ధులను జీర్ణించుకోలేకపోతున్నారని యన అన్నారు. ఇలాంటి హత్యా రాజకీయాలు ప్రజాస్వామ్యంలో మంచిది కాదని, యావత్ గౌడ జాతి మొత్తం మంత్రి కి అండగా ఉంటుంటని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌడ సంఘం నాయకులు రామ్ నాథ్ గౌడు, నరేందర్ గౌడ్, జగన్ మోహన్ గౌడ్, ప్రతాప్ గౌడ్, సుభాష్ గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, సుందరయ్య గౌడ్, మురళి గౌడ్, గోపి కృష్ణ గౌడ్, బాలా గౌడ్ వంగ రాజశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అప్పుడు బాగా ఖర్చు చేశా ఇప్పుడు ఆదా చేయాలి

Satyam NEWS

ఆధార్ మార్పులు చేర్పులు ఇక గ్రామ సచివాలయాల్లోనే

Satyam NEWS

మున్సిపల్ సిబ్బంది పోషిస్తున్న పాత్ర కీలకమైంది

Satyam NEWS

Leave a Comment