నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నా.. ఎండ తీవ్రత మాత్రం తగ్గడం లేదు. ఇవాళ ఏపిలో 188 మండలాల్లో 3 తీవ్ర వడగాలులు, 195 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
తూ.గోదావరి, గుంటూరు, కాకినాడ, పల్నాడు, అనకాపల్లి, ఏలూరు, అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, ప. గోదావరి, నెల్లూరు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.