క్రీస్తు పుట్టినరోజు క్రిస్మస్ సందర్బంగా ఆ ప్రభువు దీవెనలు అందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతీ సుభాష్ రెడ్డి ఆకాంక్షించారు. బుధవారం ఉప్పల్ డివిజన్లోని చర్చి కాలనీ రామంతపూర్ చర్చిలో ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి చేతుల మీదుగా క్రైస్తవ సోదర, సోదరిమణులకు క్రిస్మస్ కానుకలను అందజేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి కులానికి, ప్రతి మతాలను గౌరవించి ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాస్టర్లు జోసెఫ్ ,మైకేల్ రాజు, చిన్నారావు, రత్నాకర్ రెడ్డి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి , బద్దం భాస్కర్ రెడ్డి , గరిక సుధాకర్, మేకల మధుసూదన్ రెడ్డి, బన్నల ప్రవీణ్ ముదిరాజ్, నేర్దం భాస్కర్ ,ఉప్పల్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వేముల సంతోష్ రెడ్డి, మస్క సుధాకర్, గొరిగే ఐలేష్, క్రైస్తవ సోదరులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి