37.2 C
Hyderabad
April 30, 2024 11: 04 AM
Slider హైదరాబాద్

ఇద్దరు వ్యక్తుల కిడ్నాప్..?

#Kidnapping

హైదరాబాద్‌లో కామారెడ్డికి చెందిన ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ అవడం కలకలం రేపుతోంది. లుక్మాన్ అనే వ్యక్తి డబ్బులతో పరారవడంతో అతని స్నేహితులు సయ్యద్ జావిద్, సుమేరాలను దుండగులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ గురైన వ్యక్తులు జావేద్ , సుమేర్ కామారెడ్డికి పట్టణానికి చెందినవారు.కిడ్నాప్ అయిన వ్యక్తుల్ని కామారెడ్డి పట్టణంలోని ఓ ఫామ్ హౌస్‌లో ఉంచి దుండగులు చిత్రహింసలకు గురిచేశారు.

డబ్బులతో పారిపోయినా లుక్మాన్ ఎక్కడున్నాడో చెప్పాలంటే తీవ్రంగా హింసించారు. అయితే కిడ్నాప్ చేసిన దుండగుల నుంచి బాధితుడు సయ్యద్ జావిద్ తప్పించుకొని కామారెడ్డి పట్టణ పోలీసులను ఆశ్రయించారు. తమ కిడ్నాప్‌ గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమేర్ అనే వ్యక్తి కిడ్నాపర్ల చెరలో ఉన్నట్లు సయ్యద్ జావిద్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కిడ్నాపర్ల చెర నుంచి సుమేర్‌ను రక్షించేందుకు రంగంలోకి దిగారు.

Related posts

పంజాబ్ కార్మిక నేత నౌదీప్ కౌర్ కు బెయిల్ మంజూరు

Satyam NEWS

ఏసీబీ పట్టుబడిన హై స్కూల్ హెచ్ఎం

Murali Krishna

ఇంజనీర్లను సన్మానించిన ములుగు లయన్స్ క్లబ్

Satyam NEWS

Leave a Comment