25.7 C
Hyderabad
May 22, 2024 08: 19 AM
Slider కడప

అశ్వ వాహన సేవలో సౌమ్యనాధ స్వామి…

#Asva Vahana Seva

అన్నమయ్య జిల్లా నందలూరు మండల కేంద్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయమైన సౌమ్యనాథ స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏదో రోజు రాత్రి శ్రీ స్వామి నాథ స్వామి వారు అశ్వ వాహనంపై భక్తులకు దర్శన మిచ్చారు.

అంతకు ముందు స్వామి వారిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఉయ్యాలపై కొలువు తీర్చి వేద పారాయణం, అన్నమా చార్య సంకీర్తన మంగళ వాయిద్యాలు నడుమ ఉంజల సేవ జరిగినది. అనంతరం అశ్వవాహనంపై శ్రీ సౌమ్య నాథ స్వామిగా నందలూరు మాడవీధి ఉత్సవం జరిగినది.విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని సోమనాథ స్వామి వారి దర్శించు కున్నారు.

ఈ కార్యక్రమంలో
టీటీడీ డిప్యూటీ ఈవో నటేష్,ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్,ఆలయ ప్రధాన అర్చకులు సునీల్ శర్మ,ఉప అర్చకులు సాయి కృష్ణ,యశ్వంత్,పవన్ శర్మ,మనోజ్ బ్రహ్మోత్సవ కమిటీ సభ్యులు, బోయలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఐదు కుటుంబాలకు డ్రై రేషన్ అంద‌జేత‌

Sub Editor

అర్థగంటకో మరణం

Murali Krishna

కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు ఇద్దరే

Satyam NEWS

Leave a Comment