39.2 C
Hyderabad
April 30, 2024 22: 54 PM
Slider ముఖ్యంశాలు

కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు ఇద్దరే

#katipalli

కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి విమర్శ

గజ్వేల్ లో భూములు దోచుకున్న దొర కేసీఆర్, ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్ రెడ్డి ఇద్దరూ ఇద్దరేనని కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాచారెడ్డి, బిక్కనూరు మండలాలలో పలు గ్రామాలతో పాటు కామారెడ్డి పట్టణంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ.. కామారెడ్డిలో ఇద్దరిలో ఎవరు గెలిచినా కామారెడ్డిని ఆగం చేస్తారన్నారు. ప్రజా క్షేత్రంలో తేల్చుకోలేక బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు. అసత్య ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ప్రజలు అవినీతి పరులను పారదోలడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. బీజేపీ కి ఒక్క ఓటు వేసి గెలిపించాలని కోరారు.

25 న కామారెడ్డికి ప్రధాని మోడీ

ఈ నెల 25 న కామారెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి పట్టణంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొననున్నారు. 25 న మధ్యాహ్నం 1 గంటలకు కామారెడ్డికి చేరుకోనున్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండులో నిర్వహించనున్న బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సభకు సంబంధించి బందోబస్తు, ఇతర ఏర్పాట్లను జిల్లా ఎస్పీ సిందూశర్మ పరిశీలించారు. ఇందిరాగాంధీ స్టేడియంలో రెండు హెలిప్యాడ్ లకు సంబంధించి ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇప్పటికే ఎస్పీజీ బృందం కామారెడ్డికి చేరుకుంది. రేపు సభ ప్రాంగణం, పరిసర ప్రాంతాలను ఎస్పీజీ తన ఆధీనంలోకి తీసుకోనుంది. సభకు లక్ష మంది జనాలను సేకరించేందుకు బీజేపీ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. గ్రౌండులో జరుగుతున్న సభ ఏర్పాట్లను బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి పరిశీలించారు.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

19న బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు తరలిరండి

Satyam NEWS

టిడిపి అధికారంలోకి వస్తే సంక్షేమం ఆగిపోతుంది

Satyam NEWS

రైతులకు జిలుగు విత్తనాల పంపిణీ

Satyam NEWS

Leave a Comment