ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్ట లో గురువారం శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ కోదండరామ స్వామి ఆలయంకు భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.నవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం టీటీడీ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు,రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంకట మల్లి ఖార్జున రెడ్డి దంపతులు, జడ్పీ ఛైర్మన్ అకేపాటి అమరనాధ రెడ్డి పట్టువస్త్రాలను స్వామి అమ్మవార్లకు సమర్పించారు.వేద పండితులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు.ఆలయ పరిసర ప్రాంతాలు రామ నామ స్మరణతో మారు మ్రోగాయి.
previous post