విశాఖ శ్రీ శారదాపీఠంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణం కమనీయంగా సాగింది. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు వేడుకల్లో పాల్గొన్నారు. భక్తులతో కలిసి కళ్యాణ ఘట్టాన్ని తిలకించారు.
అనంతరం స్వరూపానందేంద్ర స్వామి సీతారాములకు విశేష పూజలు చేసారు. రాజోపచారాలు నిర్వహించి మహా మంగళ హారతులిచ్చారు. కళ్యాణానంతరం భక్తులకు పానకం అందజేసారు.