పోలీసు శాఖలో ఏ ఒక్క అధికారి…మాన్యువల్ ప్రకారం రెండేళ్ల కన్న..మించి పని చేసే సందర్భాలు చాలా అరుదు.అలాగే ఏడాది కాకుండా నే ఒకానొక సందర్భంలో బదిలీ అయ్యే సంఘటనలు తరచుగా జరుగుతూ ఉంటాయి. ఈ రెండో కోవలోకే ట్రాఫిక్ ఎస్ఐ ఒకరు వచ్చినట్లు తెలు స్తోంది.
విజయనగరం జిల్లా పోలీసు బాస్ ఒకరు ,ఇద్దరు కాదు.. ఏకంగా ఏడు మంది సబ్ ఇన్ స్పెక్టర్లను బదిలీ చేశారు. ఇందులో లో విజయనగరం ట్రాఫిక్ విభాగంలో సుమారు ఏడాది నుంచీ పని చేస్తున్న ఎస్ఐ దామోదర్ ను…గరివిడి కి బదిలీ చేసారు.
అక్కడ పని చేస్తున్న ఎస్ఐ ని..ట్రాఫిక్ కు బదిలీ చేశారు. అలాగే గుర్ల ఎస్ఐ శిరీషను పెదమానాపురంకు బదిలీ చేయగా..అక్కడ పని చేస్తున్న ఎస్ఐ ని గుర్ల కు బదిలీ చేశారు. అలాగే సీసీఎస్ కు..ఆండ్రకు…ఇలా ఏడుగురు ఎస్ఐ లను ఎస్పీ దీపికా బదిలీ చేస్తూ…ఉత్తర్వులు జారీ చేశారు.