26.7 C
Hyderabad
May 21, 2024 07: 36 AM
Slider నల్గొండ

హుజూరాబాద్ లో నూతన పశు వైద్యశాల  భవనానికి శంఖుస్థాపన

#saidireddy

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్లచెరువు మండల కేంద్రంలో మై హోమ్ సిమెంట్స్ ఇండస్ట్రీ శనివారం ఏర్పాటు చేసిన ఉచిత పశువైద్య శిబిరం,మందుల పంపిణీ కార్యక్రమంలో శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు.

అనంతరం మండల కేంద్రంలో 28 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న పశు వైద్యశాల భవనానికి శంకుస్థాపన చేసిన పిదప గ్రామపంచాయతీ కార్యాలయంలో లబ్ధిదారులకు సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా శాసనసభ్యుడు  శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని,మేళ్లచెరువు అభివృద్ధికి ఎల్లవేళలా తన వంతు కృషి చేస్తానని అన్నారు.నూతనంగా ఏర్పాటు చేసే పశువైద్యశాల నూతన భవన సముదాయం త్వరితగతిన పూర్తి అవుతుందని దీనివల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానిక పరిశ్రమలు చేయూత నివ్వాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారులు డాక్టర్ సురేష్ కుమార్ ఎ.డి.నల్గొండ, డాక్టర్ వెంకన్న ఎ.డి.సూర్యాపేట,డాక్టర్ అనిల్ కుమార్,డాక్టర్ రూపకుమార్, డాక్టర్ ఉషారాణి మేళ్లచెరువు,డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి హుజూర్ నగర్,హుజూర్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి, మేళ్లచెరువు సర్పంచ్ శంకర్ రెడ్డి. మేళ్లచెరువు ఎంపిపి పద్మ సైదేశ్వర రావు, చాగమారెడ్డి గోవింద్ రెడ్డి పలువురు ప్రజా ప్రతినిధులతో పాటు మై హోమ్ తరపున యూనిట్ హెడ్ శ్రీనివాసరావు,  నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

న‌వ‌నీత‌కృష్ణాలంకారంలో రామ‌య్య ముగ్ధ‌మ‌నోహ‌ర రూపం

Satyam NEWS

యుద్ధోన్మాద పుతిన్ అధికారంలో కొనసాగేందుకు వీలులేదు

Satyam NEWS

రూ.67.59 లక్షలతో నూతన తరగతి గదులు ప్రారంభo

Murali Krishna

Leave a Comment