మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ఖమ్మం నగరం 40వ దివిజన్ మోమినన్ ప్రభుత్వ ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలో రూ.67.59 లక్షలతో నిర్మించిన నూతన తరగతి గదులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. పాఠశాల గోడలపై ఎర్పాటు చేసిన పలు చిత్రాలు చూసి మంత్రి పువ్వాడ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయా తరగతి గదులలోని విద్యార్థులను కలిసి ముచ్చటించారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలతో ప్రతి విద్యార్థి ఉన్నత, నాణ్యతా ప్రమాణాలతో విద్యను పొందలనేదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. కర్యక్రమంలో కలెక్టర్ గౌతమ్, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురాభి, కార్పొరేటర్ అమృతమ్మ, డీఈఓ సోమశేఖర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
previous post
next post