ఇటీవల పొంగులేటి తో కలిసి బి ఆర్ ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన తెల్లం వెంకట్రావు కేటీర్ సమక్షంలో హైదరాబాద్ లో మళ్ళీ బిఆర్ ఎస్ లో చేరారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధ్వర్యంలో మంత్రి కేటిఆర్ సమక్షంలో పార్టీలో చేరారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గ నాయకుడుగా వున్న డా.తెల్లం వెంకటరావు గత ఎన్నికలలో భద్రాచలం నుంచి తెరాస అభ్యర్థిగా పోటీ చేసి ఒడిపోయారు. వారితో పాటు భారీ సంఖ్యలో చేరికలు జరిగాయి.