27.7 C
Hyderabad
May 22, 2024 05: 12 AM
Slider ముఖ్యంశాలు

చంద్రబాబు ఎదుట కన్నీటిపర్యంతమైన రాజధాని రైతులు

cbn Bhuvaneswari

కన్నీళ్లతో నూతన సంవత్సరoలోకి అడుగుపెట్టామని రాజధాని గ్రామాల రైతులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. భూములిచ్చి రోడ్డున పడ్డామని, కనీసం కారుణ్య మరణాలకైనా అవకాశం కల్పించాలని వారు కోరారు. ఏ రోజూ కంటి నిండా నిద్ర కూడా పోవటం లేదు, తిండి కూడా తినటం లేదు అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్రబాలెం రైతుల నిరసన దీక్షకు చంద్రబాబు మద్దతు తెలిపారు.

ఆయనతో బాటు ఆయన భార్య భువనేశ్వరి, బావమరిది రామకృష్ణ కూడా ఉన్నారు. ఈ రాష్ట్రానికి జగన్ సీఎమ్మో విజయసాయి సీఎమ్మో అర్ధం కావట్లేదని రైతుల దుస్థితి చూడలేకపోతున్నానని అన్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలనుకోవటం తగదని ఆయన అన్నారు. అమరావతి 5కోట్ల ప్రజలకు రాజధాని గా కావాలని ఆయన అన్నారు. రైతుల దుస్థితి చూడలేకపోతున్నానని కంటతడి నందమూరి రామకృష్ణ కన్నీరు పెట్టుకున్నారు.

Related posts

(Free|Sample) Legal Test Booster Male Enhancement For Patient With Blood Thinner

Bhavani

అంబేద్కర్ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా కో కన్వీనర్ గా మారెపల్లి నవీన్

Satyam NEWS

కామారెడ్డి లో యువకుడి దారుణ హత్య

Satyam NEWS

Leave a Comment