28.7 C
Hyderabad
April 28, 2024 10: 05 AM
Slider నిజామాబాద్

కామారెడ్డి లో యువకుడి దారుణ హత్య

maxresdefault

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డులో గల గంజ్ గేజ్ పక్కన ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట కాలనీకి చెందిన తొఫిద్(28) వృత్తి రీత్యా హమాలి కూలి. రోజు హమాలి కూలి చేసుకుంటూ మద్యం సేవిస్తూ ఎక్కడపడితే అక్కడ పడుకుంటాడు. అయితే మంగళవారం తెల్లవారుజామున పడుకుని ఉన్న తొఫిద్ తలపై గుర్తు తెలియని దుండగులు బండరాయితో బలంగా బాది హత్య చేసినట్లు తెలిసింది. ఘటన స్థలానికి డిఎస్పీ లక్ష్మీనారాయణ, పట్టణ ఎస్ హెచ్ ఓ జగదీష్, ఎస్సై రవికుమార్ చేరుకుని విచారణ చేపట్టారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఎప్పుడు ఇంటికి వచ్చే తమ కుమారుడు రాత్రి రాలేదని తెల్లారేసరికి శవమై కనిపించాడని తల్లి షబానా రోదిస్తూ తెలిపింది.

Related posts

పద్మశాలి సంఘం అన్నదాన కార్యక్రమం

Satyam NEWS

అబుల్ కలాం ఆజాద్ స్ఫూర్తితో విద్యాభివృద్ధి

Satyam NEWS

వయెావృద్ధులైన తల్లిదండ్రుల బాధ్యత పిల్లలదే….

Satyam NEWS

Leave a Comment